Friday, November 23, 2007

రాజకీయ పద్యాలు

ఆంధ్రరాష్ట్రంలో జరుతున్నాయి తరుచుగా బందులు
శవాలకై వెదుకుతున్నాయి రాజకీయ రాబందులు
చైతన్యంతో ప్రశ్నించాలి అణగారిన గొంతులు
రాజ్యాధికారంలో పొందాలి సమాన వంతులు

అగ్రవర్ణాల దోపిడి,నువ్వు ఎపుడూ చెప్పే కధ
నీకులంవాడే నిన్ను దోచుకోవడం నేటి విషాధగాధ
దోపిడీవర్గానిది ఎపుడూ ఒకటే కులం
పంచుకు తింటుంది అభివృద్ధి ఫలం


మన రాజ్యాంగానికి ఉడిగాయి జవసత్వాలు
కొనసాగుతున్నాయి ఫత్వాలు,రిజర్వేషన్ వారసత్వాలు
ఇదేనా సామాజిక న్యాయం? ఎన్నాళ్ళీ ఓటు రాజకీయం?
స్రవిస్తున్న ఈ గాయం,పాడుతోందీ గేయం


తరచిచూసిన కొందరు నాయకుల గతమంతా
ఉండును నేరచరిత ఎంతోకొంత
వారు పాతకేడీలు, వీధి రౌడీలు
అభినవకీచకులు,జగత్ కిలాడీలు

పదవిపై ఎంతో ఉబలాటం
పగలూ రాత్రీ అదే ఆరాటం
విడిపోవాలంటూ ఒకటే ఉన్మాదం
ఏమౌతుందో ఈ ఉమ్మడి సౌధం!

ఓటుకోసమొచ్చిన ప్రతీసారి
నోటికొచ్చిన వాగ్ధానమల్లా చేస్తావు
సీటుగెల్చిన మత్తులో గతాన్నే మరుస్తావు
మాబ్రతుకులు చేస్తున్నాయి బొమ్మగుర్రం సవారి

ఇంకా ఎన్నాళ్ళో పాలెగాళ్ళ పాలన!
వలుచుకున్నది చాలదా ఓ దుశ్శాసన
వినబడుతున్నదా మన తెలుగుతల్లి రోధన?
కొంచెమైనా చేసుకో నీ ఆత్మశోధన!

దేశంలో తీవ్రవాదం మరలా నిద్రలేచింది
మతంపేరుతో వికృతంగా ఆవలించింది
అమాయకుల ప్రాణాలు ఫలహారించింది
ప్రజాస్వామ్యానికి సవాలుగ నిలిచింది

జర్నలిజం పడుతోంది అడ్డదారి
సంచలనాలకోసం వెదికింది దొడ్డిదారి
దీనికన్న నయం గ్రామాల్లోని చాటింపు
ఈవిపరీతధోరణికి రావాలి ఇక ముగింపు

2 comments:

పద్మనాభం దూర్వాసుల said...

మీ రాజకియ పద్యాలు ఇప్పుడే చూడడం జరిగింది. నేటి దుస్తితికి మీ పద్యాలు అద్దం పడుతున్నాయి.మరిన్ని పద్యాలకోసం ఎదురు చూస్తా

- పద్మనాభం

Prasad Samantapudi said...

పద్మనాభం గారు,

ధన్యవాదాలు